భారీ వర్షాలతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి

Published: Wednesday September 29, 2021
మేయర్ బుచ్చిరెడ్డి కార్పొరేటర్ నరసింహ
మేడిపల్లి, సెప్టెంబర్ 28 (ప్రజాపాలన ప్రతినిధి) : బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో కురుస్తున్న భారీ వర్షాలకు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని మేయర్ సామల బుచ్చిరెడ్డి, కార్పొరేటర్ చీరాల నరసింహ సూచించారు. ఈ మేరకు 28వ డివిజన్లో వరద ముంపు ప్రాంతాలను స్థానిక కార్పొరేటర్ చీరాల నరసింహతో కలిసి మేయర్ సామల బుచ్చిరెడ్డి పర్యటించారు. ఈ సందర్భంగా భారీ వర్షాలతో పరిసర ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని మేయర్, కార్పొరేటర్ విజ్ఞప్తి చేశారు. ఎవరికి ఏ ఇబ్బంది కలిగినా వెంటనే సంప్రదించాలని తేలియజేశారు. ఈ కార్యక్రమంలో 28వ డివిజన్ అధ్యక్షులు చిన్నిగళ్ళ సంతోష్, మహిళా అధ్యక్షురాలు భార్గవి, డివిజన్ ఉపాధ్యక్షులు చంటి శివ ఉప్పరి విజయ్ మైసగళ్ళ శ్రీకాంత్ చిన్నిగళ్ళ వినయ్ కాలనీవాసులు, మున్సిపల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.