ప్రజా పాలన వార్తకు స్పందన

Published: Saturday May 08, 2021

బెల్లంపల్లి మే 7 ప్రజా పాలన ప్రతినిధి : బెల్లంపల్లి సింగరేణి ఏరియా హాస్పిటల్ ఐసోలేషన్ కేంద్రంలో వ్యాక్సిన్ కోసం వచ్చిన పేషెంట్లకు కనీస సదుపాయాలులేక ఎండలో నిలబడి నానా తంటాలు పడుతున్న విషయాన్ని ప్రజాపాలన. దినపత్రికలో ప్రచూరించడం జరిగింది. దీంతో అధికారులు స్పందించారు. రోగులకు సౌకర్యాలు ఏర్పాటు చేశారు. నీడకోసం గ్రీన్ షీట్ ని కట్టి, ఆ ప్రాంతంలో కుర్చీలు ఏర్పాటు చేశారు. సౌకర్యాల ఫట్ల స్థానిక ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ప్రజాపాలన కు వందనాలు తెలుపుతున్నారు.