ప్రారంభానికి నోచుకోని గ్రామపంచాయతీ నూతన భవనం

Published: Wednesday February 22, 2023
శంకరపట్నం ఫిబ్రవరి 21 ప్రజాపాలన రిపోర్టర్:


శంకరపట్నం మండలం కేశవపట్నం గ్రామంలో నూతనంగా నిర్మించిన గ్రామపంచాయతీ భవనం ప్రారంభానికి నోచుకోవడం లేదు. ప్రభుత్వం ఎన్నో నిధులు వెచ్చించి కొత్త భవనాన్ని కట్టించి నెలలు గడుస్తున్నా పాత భవనం నుంచి కొత్త భవనంలోకి గ్రామపంచాయతీ మార్చకపోవడం గ్రామంలో చర్చనీయా అంశంగా మారింది. రాష్ట్రంలోని అనేక గ్రామాల్లో కొత్త భవనాలు నిర్మించుకునేందుకు నిధులు లేక ఎదురుచూపులు చూస్తుంటే ఈ గ్రామంలో మాత్రం తయారీగా ఉన్న కొత్త భవనంలోకి మారెందుకు అడ్డంకులు ఏమున్నాయని ప్రజలు పాలకవర్గాన్ని ప్రశ్నిస్తున్నారు. ఈ నిర్మాణాన్ని వాడకుండా నిరుపయోగంగా ఉంచితే త్వరగా  శిథిలావస్థకు చేరే అవకాశంతో పాటు, గ్రామంలో అసాంఘిక కార్యకలాపాలకు నిలయంగా మారుతుందని స్థానికులు వాపోతున్నారు. ఇకనైనా పంచాయతీ పాలకవర్గం చొరవ తీసుకొని వెంటనే కొత్త గ్రామపంచాయతీ కార్యాలయాన్ని ప్రారంభించవలసిందిగా  గ్రామస్తులు కోరుచున్నారు.