కంటి వెలుగు పథకం దేశానికి ఆదర్శం

Published: Friday January 20, 2023
పరిగి ఎమ్మెల్యే కొప్పుల మహేష్ రెడ్డి
వికారాబాద్ బ్యూరో 19 జనవరి ప్రజా పాలన : కంటి వెలుగు పథకం దేశానికి ఆదర్శంగా నిలుస్తుంది అని పరిగి ఎమ్మెల్యే కొప్పుల మహేష్ రెడ్డి అన్నారు. గురువారం పరిగి మున్సిపల్ పరిధిలోని ఒకటవ వార్డుకు సంబంధించిన మల్లెమోని గూడ, దోమ మండలం బొంపల్లి గ్రామంలో కంటి వెలుగు కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా పరిగి ఎమ్మెల్యే మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న రెండవ విడత కంటి వెలుగు కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. కంటి సమస్యలతో బాధపడే వారందరూ శిబిరాలకు వచ్చి కంటి పరీక్షలు చేయించుకోవాలని స్పష్టం చేశారు. అవసరమైన వారికి మందులు కళ్లద్దాలు వైద్య చికిత్స అందజేయబడునని తెలిపారు.
ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ ముకుంద అశోక్ కుమార్, ఎంపీపీ కరణం అరవింద్ రావు, స్థానిక కౌన్సిలర్ వాసియా తబస్సుమ్ మౌలానా, సింగిల్ విండో వైస్ చైర్మన్ భాస్కర్, జిల్లా సీనియర్ నాయకులు ప్రవీణ్ రెడ్డి, ఎంపీపీ పి.అనసూయ, జెడ్పీటీసీ కే.నాగి రెడ్డి, వైస్ ఎంపీపీ మల్లేశం,  గ్రామ సర్పంచ్, ఎంపీటీసీ, బిఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షులు గోపాల్ గౌడ్, అధికారులు తదితరులు పాల్గొన్నారు.