*కాంగ్రెస్ తోనే అభివృద్ధి* -- జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖ

Published: Monday March 13, 2023
మంచిర్యాల టౌన్, మార్చి 12, ప్రజాపాలన : హాత్ సే హాత్ జోడో యాత్రలో భాగంగా నస్పూర్ మున్సిపల్ పరిధిలోని 13వ వార్డులో ఆదివారం ఇంటిటికీ పాదయాత్ర చేపట్టారు. 
కాంగ్రెస్ హయాంలోనే అభివృద్ధి సంక్షేమానికి బీజం పడిందని జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖ అన్నారు. ఈ సందర్భంగా ఇంటింటికీ వెళ్లి కాంగ్రెస్ అధికారంలో ఉన్న సమయంలో ప్రజలకు అందించిన సేవలను వివరించారు. ప్రజలు నుంచి అనేక సమస్యలను అడిగి తెలుసుకున్నారు. వార్డులో ముఖ్యంగా త్రాగునీటి సమస్య తీవ్రంగా ఉందని, మురికి కాలువల సమస్య ప్రధానంగా ఉందని నిర్మాణం పూర్తి స్థాయిలో లేకపోవడంతో దుర్వాసన  రావడంతో స్థానికులు అనారోగ్యాలకు గురవుతున్నారని  ఆరోపించారు. రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే మళ్ళీ ప్రజలకు మంచి రోజులు వస్తాయని సురేఖ భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో నస్పూర్ పట్టణ అధ్యక్షుడు బండారి సుధాకర్,ఫ్లోర్ లీడర్ సురిమిల్ల వేణు,యువజన కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు తాళ్ల సంపత్ రెడ్డి, 13వ వార్డు ఇంచార్జ్ దొమ్మటి కిరణ్,పట్టణ కార్యదర్శి దారవేణి తిరుపతి, నాయకులు రామ్మూర్తి, దేవేందర్, రజిత సునిత, రాజేశ్వరి, కలావతి, రిటైర్మెంట్ కార్మికులు తదితరులు పాల్గొన్నారు.