డబుల్ బెడ్ రూం ల దరఖాస్తుల పరిశీలన

Published: Monday April 03, 2023
* జిల్లా అదనపు కలెక్టర్ రాహుల్ శర్మ
వికారాబాద్ బ్యూరో 02 ఏప్రిల్ ప్రజాపాలన : 
డబుల్ బెడ్ రూమ్ ల కోసం నేటి వరకు స్వీకరించిన  దరఖాస్తుల వెరిఫికేషన్ పనులను సోమవారం నుండి చేపట్టాలని జిల్లా అదనపు కలెక్టర్ రాహుల్ శర్మ అన్నారు. ఆదివారం వికారాబాద్,  తాండూర్ ఆర్డివోలు మున్సిపల్ కమిషనర్లతో డబల్ బెడ్ రూమ్ వెరిఫికేషన్ పై టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు.  ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, తాండూర్ మున్సిపల్ పరిధిలో 9436, పరిగి మున్సిపల్ పరిధిలో 1151  దరఖాస్తులను స్వీకరించడం జరిగిందని తెలిపారు.   వచ్చిన దరఖాస్తుల వెరిఫికేషన్ కోసం రెవెన్యూ,  మున్సిపల్ సిబ్బందితో టీంలను ఏర్పాటు చేసి దరఖాస్తు చేసుకున్న వారి వివరాలను వారి ఇండ్లకు వెళ్లి   వెరిఫికేషన్ పనులు చేపట్టి అర్హులను గుర్తించాలని అన్నారు.