కుటుంబాలను పరామర్శించిన జడ్పీటీసీ ప్రమీల దంపతులు..
Published: Friday November 11, 2022
తల్లాడ, నవంబర్ 10 (ప్రజాపాలన న్యూస్):
తల్లాడ మండలంలో గురువారం పలువురు మృతుల కుటుంబాలను తల్లాడ జడ్పీటీసీ దిరిశాల ప్రమీల, టిఆర్ఎస్ పార్టీ జోనల్ చైర్మన్ దిరిశాల దాసురావు దంపతులు పరామర్శించారు. మండలంలోని కలకొడిమ గ్రామానికి చెందిన తాళ్లూరి వెంకటేశ్వర్లు దశదిన కర్మకు అదేవిధంగా బస్వాపురం గ్రామంలో రజక సంఘం నాయకులు కావటి శ్రీపతి దశదినకర్మకు వారు హాజరయ్యారు. ఈ సందర్భంగా వారి చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. కుటుంబ సభ్యులకు తమ ప్రగాఢ సంతాప సానుభూతిని వ్యక్తం చేశారు. నివాళులు అర్పించిన వారిలో టిఆర్ఎస్ పార్టీ కార్యదర్శి పేటూరి నరసింహారావు, కలకోడిమ టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు బండి మోహన్ రావు, ఉపాధ్యాయులు వెంకటప్పయ్య, తదితరులు ఉన్నారు.*
Share this on your social network: