దోమల మందును పిచికారి చేయించిన సర్పంచ్ నోముల వెంకట నరసమ్మ

Published: Monday July 18, 2022
 బోనకల్, జులై 18 ప్రజా పాలన ప్రతినిది: మండలoలోని గత కొన్ని రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్న కారణంగా ఆదివారం తూటికుంట్ల గ్రామంలో దోమలు వ్యాప్తి చెందకుండా, ప్రజలు సీజనల్ వ్యాధుల బారిన పడకుండా ఉండాలని గ్రామ సర్పంచ్ నోముల వెంకట నరసమ్మ ఆధ్వర్యంలో దిల్పాగ్ మందును పిచికారి చేయించటం జరిగింది. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ గ్రామ ప్రజలకు ఎప్పటికప్పుడు అందుబాటులో ఉంటూ గ్రామ అభివృద్ధికి తోడ్పడుతూ ఎప్పటికప్పుడు గ్రామ ప్రజల సమస్యలు తెలుసుకుంటూ సమస్య వచ్చినా వెంటనే స్పందించి గ్రామాన్ని అభివృద్ధి చేయడమే పనిచేస్తున్నానని తెలిపారు. ఈ కార్యక్రమంలో మల్టీ పర్పస్ గ్రామపంచాయతీ సిబ్బంది పాల్గొన్నారు.