మరణించిన కార్మికులకు ఘన నివాళులు

Published: Thursday May 13, 2021

మంచిర్యాల టౌన్, మే12, ప్రజాపాలన : మంచిర్యాల మున్సిపల్ కార్యాలయం లో గత వారం అనారోగ్యం తో చనిపోయిన పర్మినెంట్ కార్మికురాలు జిలకర స్వరూప, కోవిడ్ కరోనాతో చనిపోయిన ఒప్పంద కార్మికుడు బచ్చల నర్సయ్య లకు బుధవారం మంచిర్యాల మున్సిపల్ చైర్మన్ పెంట రాజయ్య, మున్సిపల్ కమిషనర్ జి.స్వరూప రాణి, కార్మిక సంఘం గౌరవ అధ్యక్షులు సుదమల హరికృష్ణ లు నివాళులు అర్పించి వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపరు. చైర్మన్, కమిషనర్లు ఈ సంద్భంగా మాట్లాడతూ మున్సిపల్ కార్మికులకు పట్టణ ప్రజలకు తగు సూచనలు చేశారు అందరు తప్పకుండ మాస్కు, శానిటేజర్, భౌతిక దూరం పాటించాలని చెప్పరు. అలాగే మంచిర్యాల పట్టణ ప్రజలు దయచేసి ఈ కరోనా మహమ్మారి వల్ల చాలా మంది జనాలు చనిపోతున్నారని, అందరూ నిత్య అవసర సరుకులకు తప్ప బయటకు రాకుండా జాగ్రత్త పడాలని కోరారు. పట్టణ ప్రజలు మున్సిపల్ కార్మికులకు తమ ఇండ్లలో ఉండే చెత్తను కాలనీలోకి వస్తున్న చెత్త బండ్లకు స్వయంగా వచ్చి వరికీ ఇవ్వాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో పలువురు నాయకులు, కార్మికులు తదితరులు పాల్గొన్నారు.