ఐసోలేషన్ కేంద్రాన్ని ప్రారంభంచిన సుమలత

Published: Wednesday May 05, 2021
మల్లాపూర్, ఏప్రిల్ 04 (ప్రజాపాలన ప్రతినిధి) : మల్లాపూర్ మండలం సాతరం గ్రామంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను కోవిడ్-19 బాధితుల కోసం 4 పడకల ఐసోలేషన్ కేంద్రాన్ని మంగళవారం గ్రామ సర్పంచ్ బొడ్డు సుమలత రాజేష్  ప్రారంభించారు.ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ గ్రామంలో కరోనా ఉదృతంగా వ్యాప్తి చెందుతున్న దృష్ట్యా ఎవరికైనా కరోనా వచ్చిన వారి ఇంటి వద్ద వసతులు సౌకర్యవంతంగా లేనిచో ఈ గదులను ఉపయోగించుకోవాలని కోరుతూ, కరోనా వచ్చిందని ప్రజలెవరూ ఆందోళనకు గురికావద్దని అన్నారు. ప్రతి ఒక్కరు మాస్కు ధరించి, భౌతిక దూరం పాటించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ గున్నల శ్రీనివాస్‌, ఉపసర్పంచ్‌ శ్రీనివాస్‌ యాదవ్‌, వార్డుసభ్యులు, కార్యదర్శి, కరిబార్‌ రమేష్‌, యువజన సంఘాలా సమితి జిల్లా అధ్యక్షులు బొడ్డు రాజేష్‌, రాజాం, మహేష్‌ తదితరులు పాల్గొన్నారు.