ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పై ఫిర్యాదు

Published: Thursday March 18, 2021
బిజెపి జిల్లా దళిత మోర్చా అధ్యక్షుడు పెద్దింటి నవీన్ కుమార్
వికారాబాద్ జిల్లా ప్రతినిధి మార్చి17 ( ప్రజాపాలన ) : హిందూ దేవుళ్లను కించపరిచేలా అనుచిత వ్యాఖ్యలు చేసిన ఐపీఎస్ అధికారి ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్ పై చర్యలు తీసుకోవాలని బిజెపి జిల్లా దళిత మోర్చా అధ్యక్షుడు నవీన్ కుమార్ డిమాండ్ చేశారు. బుధవారం జిల్లా కేంద్రంలోని పోలీస్ స్టేషన్లో బిజెపి జిల్లా దళిత మోర్చా ఆధ్వర్యంలో జిల్లా అధ్యక్షుడు సదానంద్ రెడ్డి జిల్లా ప్రధాన కార్యదర్శి విజయభాస్కర్ రెడ్డి కిసాన్ మోర్చా జిల్లా అధ్యక్షుడు మహిపాల్ రెడ్డి పూడూరు మండల అధ్యక్షుడు అనిల్ శేరి శ్రీధర్ రెడ్డి లతో కలిసి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పై చట్టపరంగా చర్యలు తీసుకోవాలని ఎస్ఐ లక్ష్మయ్య కు ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా బిజెపి దళిత మోర్చా అధ్యక్షుడు పెద్దింటి నవీన్ కుమార్ మాట్లాడుతూ ఈనెల 15వ తేదీన స్వేరోస్ సంస్థ భీమ్ దీక్ష జ్ఞాన దీక్ష పెద్దపల్లి జిల్లా వడ కపూర్ ధూళికట్ట లో ప్రతిజ్ఞ చేసే సమయంలో హిందూ దేవుళ్లను కించపరిచే విధంగా అనుచిత వ్యాఖ్యలు చేయడం అమానుషమని గుర్తుచేశారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో అన్ని మతాలు వర్గాల వారు ఐకమత్యంతో ఎవరి సంస్కృతి సంప్రదాయాలను ఆచరించే సాంప్రదాయం ఉన్నదని పేర్కొన్నారు. తన మతాన్ని ప్రచారం చేసుకునేందుకు ఇతరుల మతాలను కించపరిచే హక్కు ఏ పౌరునికి లేదని గుర్తు చేశారు. పేద పిల్లలను చదువుకు దూరమైన వారిని చేరదీసి విద్యాబుద్ధులు నేర్పించి ఉన్నత పదవుల్లో అధిష్టించేందుకు చేస్తున్న కృషి అభినందనీయమని కొనియాడారు. కానీ ఇతర మతాల వారి ఆచారవ్యవహారాలను అవమానించడం తగదని హితవు పలికారు.