బోడుప్పల్లో కేటీఆర్ పర్యటన గురించి మంత్రి మల్లారెడ్డితో మేయర్ కార్పొరేటర్లు సమావేశం

Published: Tuesday February 01, 2022
మేడిపల్లి, జనవరి 31 (ప్రజాపాలన ప్రతినిధి) : బోడుప్పల్ నగర పాలక సంస్థ మేయర్ సామల బుచ్చిరెడ్డి మరియు కార్పొరేటర్లు సోమవారం రాష్ట్ర కార్మిక శాఖామాత్యులు చామకూర మల్లారెడ్డిని కలిసి వచ్చేనెల ఫిబ్రవరి 2వ తేదీన బోడుప్పల్లో మున్సిపల్ శాఖామాత్యులు కేటీఆర్ పర్యటన గురించి చర్చించారు. నాళా పనుల శంకుస్థాపనకు సంబంధించి అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని ఈ సంధర్బంగా మేయర్ సామల బుచ్చిరెడ్డి మంత్రి మల్లారెడ్డికి తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు కొత్త చందర్ గౌడ్, సీసా వెంకటేష్, సుమన్ భూక్య చీరాల నర్సింహ మరియు సీనియర్ నాయకులు కొత్త రవిగౌడ్, కాటపల్లి రామచంద్ర రెడ్డి, కొత్త చక్రపాణి గౌడ్, పూలకండ్ల జంగారెడ్డి, గుర్రాల వెంకటేష్ యాదవ్, జక్కల రాములు మరియు మేడ్చల్ యువజన నాయకుడు మరియు మల్లారెడ్డి హెల్త్ సిటీ చైర్మన్ చామకూర భద్రారెడ్డి  తదితరులు పాల్గొన్నారు.