దోమడుగులో సీసీ రోడ్డు పనులను ప్రారంభించిన ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

Published: Tuesday July 20, 2021
గుమ్మడిదల, జులై 19, ప్రజాపాలన ప్రతినిధి : గుమ్మడిదల మండలం దోమడుగు గ్రామంలో (సి ఎస్ ఆర్) 25 లక్షల రూపాయలతో నూతన సిసి రోడ్డు నిర్మాణ పనులకు సోమవారం శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి, స్థానిక సర్పంచ్ రాజశేఖర్ తో కలిసి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ ప్రభాకర్, ఎంపీపీ ప్రవీణ విజయ భాస్కర్ రెడ్డి, జడ్పిటిసి కుమార్ గౌడ్, ఎంపిటిసి ఉషగోని గోవర్ధన్ గౌడ్, ఉప సర్పంచ్ స్వరూప రాంరెడ్డి, గ్రామ కార్యదర్శి ప్రవీణ్ గౌడ్, వార్డు సభ్యులు నర్సంపల్లి సుధాకర్ రెడ్డి, ర్యాలమడుగు కిషోర్, జంగ బాలకృష్ణ యాదవ్, మద్ది నవీన్ రెడ్డి, శ్రీమతి పట్నం సునీత- లింగం, కడారి శ్రీనివాస్ గౌడ్, శ్రీమతి చింతల పుష్పాలత-భద్రయ్య, కో-ఆప్షన్ సభ్యులు మద్ది కృష్ణ రెడ్డి, నాయకులు, కార్యకర్తలు, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.