*పదవ తరగతి విద్యార్థులకు పరీక్ష సామగ్రి పంపిణీ*
Published: Wednesday March 29, 2023
మంచిర్యాల టౌన్, మార్చి 28, ప్రజాపాలన: నస్పూర్ సి సి సి సింగరేణి పాఠశాలలో ప్రస్తుత 10వ తరగతి విద్యార్థులు పరీక్షలు వ్రాయబోతున్న తరుణంలో, సింగరేణి పాఠశాల పూర్వ విద్యార్థి సంఘం తరఫున పూర్వ విద్యార్థులు మంగళవారం వారికి పరీక్షలకు సంబంధించిన సామగ్రి బహుకరించారు. అనంతరం స్థానిక జిఎం సంజీవరెడ్డి, జిఎం త్యాగరాజన్, కరస్పాండెంట్ రాజేశ్వర్ ల సమక్షంలో,
పాఠశాలలో జరిగిన పదవ తరగతి వీడ్కోలు సమావేశం పాల్గొని వారు మాట్లాడుతూ
పూర్వ విద్యార్థి సంఘం భవిష్యత్తులో మరెన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ అటు బడికి ఇటు బడి పిల్లలకు పూర్వ విద్యార్థులకు సమాజానికి
ఉపకరించే మరెన్నో సేవా కార్యక్రమాలు చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో అధ్యక్షులు రాపోలు విష్ణువర్ధన్ రావు, ప్రధాన కార్యదర్శి దొనికెన సమ్మయ్య, కోశాధికారి డప్పు సమ్మయ్య ఉపాధ్యక్షులు కే శ్యాంసుందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Share this on your social network: