అర్హులైన జర్నలిస్టులందరికీ ఇళ్ళు, ఇళ్ళ స్థలాలు కేటాయించాలి

Published: Monday July 12, 2021
కూకట్ పల్లి : (ప్రజాపాలన) టిడబ్ల్యూజెఎఫ్ మేడ్చల్ నియోజకవర్గ సమావేశం తీర్మానం చేశారు. మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా లోని అర్హులైన జర్నలిస్టులందరికీ ఇళ్ళు, ఇళ్ళ స్థలాలు కేటాయించాలని తెలంగాణ వర్కింగ్ జర్నలిస్టుల ఫెడరేషన్ (టిడబ్ల్యూజెఎఫ్) మేడ్చల్ నియోజకవర్గ సమావేశ తీర్మానించింది. ఆదివారం నాగారంలోని సెరినిటీ మోడల్ హై స్కూల్ లో జరిగిన టిడబ్ల్యూజెఎఫ్ మేడ్చల్ నియోజకవర్గ స్థాయి సమావేశానికి జిల్లా అధ్యక్షులు తన్నీరు శ్రీనివాస్ అధ్యక్షతన వహించారు. సమావేశానికి ఐఎఫ్ డబ్ల్యూజె జాతీయ కౌన్సిల్ సభ్యులు మెరుగు చంద్రమోహన్, రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు బెలిదే అశోక్, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఎంపల్లి పద్మారెడ్డి జిల్లా కార్యదర్శి యావపురం రవి, కోశాధికారి కళ్యాణ చక్రవర్తి లు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మేడ్చల్ నియోజకవర్గ నూతన కమిటీని ఎన్నుకున్నారు కమిటీ అధ్యక్షులు గా బుర్ర శ్రీధర్ ఉపాధ్యక్షులుగా జి పరుశురాం ప్రధాన కార్యదర్శిగా యాట రాజు, సంయుక్త కార్యదర్శులుగా కీసర రవి కుమార్, ఎం. విష్ణుమోహన్, ఆర్గనైజింగ్ కార్యదర్శులుగా బి.దినకర్, ఆవుల భాస్కర్ రావు, కోశాధికారిగా ఆర్. సతీష్ గౌడ్ ను ఎన్నుకున్నారు. ఇటీవల జిల్లా కమిటీ ఉపాధ్యక్షులుగా ఎన్నికైన పటేల్ నరసింహులు, సంయుక్త కార్యదర్శి టి.రమేష్, ఆర్గనైజింగ్ కార్యదర్శి వి.రాములతో పాటు మేడ్చల్ నియోజకవర్గ నూతన కార్యవర్గాన్ని ఈ సందర్భంగా ఘనంగా సన్మానించారు.