ప్రతి డివిజన్లో కాంగ్రెస్ పార్టీ సభ్యత్వ నమోదును వేగవంతం చేయాలి

Published: Wednesday February 02, 2022
కాంగ్రెస్ నాయకులు రాగిడి లక్ష్మారెడ్డి
మేడిపల్లి, ఫిబ్రవరి1 (ప్రజాపాలన ప్రతినిధి) ప్రతి డివిజన్ పరిధిలో కాంగ్రెస్ పార్టీ  నాయకులు, కార్యకర్తలు సభ్యత్వ నమోదును వేగవంతం చేయాలని ఉప్పల్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు రాగిడి లక్ష్మారెడ్డి సూచించారు. రామంతాపూర్ డివిజన్లో కాంగ్రెస్ పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో రాగిడి లక్ష్మారెడ్డి పాల్గొన్నారు. ఈ మేరకు డివిజన్లోని గోఖలే నగర్ బృందావన్ గార్డెన్స్ సంక్షేమ సంఘం భవన్లో సంఘం సభ్యులతో రాగిడి లక్ష్మారెడ్డి సమావేశమై కాంగ్రెస్ పార్టీ సభ్యత్వ నమోదు వివరాలు మరియు సభ్యత్వ నమోదు చేసుకున్న ప్రతి ఒక్కరికీ 2లక్షల ఉచిత బీమా సౌకర్యం కల్పిస్తున్నట్లు అయాన సంక్షేమ సంఘం సభ్యులకు వివరించారు. ఆనంతరం కాంగ్రెస్ పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సీనియర్ కాంగ్రెస్ నాయకులు మల్లేశ్. ఎస్ టి సెల్ చైర్మన్ గణేష్ నాయక్ డివిజన్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.