వసంత గమనంలో వచ్చిన రంగుల హోలీ
Published: Tuesday March 30, 2021
బాలాపూర్, మార్చి 29, ప్రజాపాలన ప్రతినిధి : చెడుపై మంచి గెలుపుకు గుర్తుగా హోలీ పండుగ బీజేపీ సీనియర్ నాయకులు కోలన్ శంకర్ రెడ్డి అన్నారు. మహేశ్వరం నియోజకవర్గంలోని బడంగ్ పేట్ మున్సిపల్ కార్పొరేషన్ లో బాలాపూర్ నివాసి అయినటువంటి బిజెపి సీనియర్ నాయకుడు కిసాన్ మోర్చా ప్రధాన కార్యదర్శి మాజీ సింగిల్విండో చైర్మన్ కోలన్ శంకర్ రెడ్డి, పిల్లలు వారి బృందంతో వసంత గమనంలో వచ్చిన రంగుల హోలీ పండుగను జరుపుకుంటారునీ పేర్కొన్నారు. యావత్ తెలంగాణ ప్రజలకు బడంగ్ పేట్ కార్పొరేషన్ ప్రజలందరికీ హోలీ శుభాకాంక్షలు తెలియజేశారు. చెడుపై మంచి గెలుపుకు గుర్తుగా ఈ పండుగనీ భగవంతుని కరోనా వైరస్ ను పూర్తిగా తగ్గించి ప్రజలకు మంచి ఆరోగ్యం సుఖసంతోషాలు కల్పించాలని కోరారు. ఈ కార్యక్రమంలో బిజెపి నాయకులు ఎం. ప్రభాకర్ రెడ్డి, రామిడి శేఖర్ రెడ్డి, సంజీవ, పి సుధాకర్, భరత్ గౌడ్, నరేష్, ఉజ్వల్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.
Share this on your social network: