మండలంలో 22 మందికి కరోనా పాజిటివ్ నిర్ధారణ

Published: Wednesday May 26, 2021

వలిగొండ ప్రజాపాలన ప్రతినిధి : మండల పరిధిలోని వలిగొండ ప్రాథమిక కేంద్రంలో 18 మందికి టెస్ట్ చేయగా 8 మందికి, వర్కట్ పల్లి ప్రాథమిక కేంద్రంలో 31 మందికి టెస్ట్ చేయగా 9 మందికి, వేములకొండ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో 15 మందికి టెస్ట్ చేయగా 5 గురికి పాజిటివ్ నిర్దారణ అయిందని, వారికి కరోనా పట్ల తీసుకోవాలిసిన జాగ్రత్తలు తెలిపి, వారిని హోమ్ క్వారెంటైన్ చేశామని డాక్టర్లు సుమన్ కళ్యాణ్, కిరణ్ కుమార్, స్వామి లు తెలిపారు.