కరోనాతో జాగ్రత్తగా ఉండండి ఎర్రుపాలెం ఎస్సై మేడా ప్రసాద్.....

Published: Wednesday January 19, 2022
ఎర్రుపాలెం జనవరి 18 ప్రజాపాలన ప్రతినిధి: శాంతిభద్రతల పరిరక్షణలో భాగంగా జనవరి 31వ తేదీ వరకు ఎర్రుపాలెం మండల పరిధిలో 30 పోలీస్ యాక్ట్ యధావిధిగా అమలులో వుంటుందని ఎస్సై మేడా ప్రసాద్ ఓ ప్రకటనలో తెలిపారు.  ఆంక్షలు అమలుల్లో వున్నందున అనుమతి లేకుండా ఎలాంటి సభలు, ర్యాలీలకు, సమావేశాలు నిర్వహించరాదని సూచించారు. గుంపులుగా తిరగటం నిషేధం వున్న నేపథ్యంలో వివిధ వర్గాల ప్రజలు, రాజకీయ పార్టీలు, వివిధ సంఘాల నాయకులు పోలీసులకు సహకరించాలని కోరారు. ఎర్రుపాలెం పోలీస్ పరిధిలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తు జాగ్రత్త చర్యల్లో భాగంగా 30 పోలీసు యాక్ట్ అమలు చేస్తున్నట్లు ఎస్సై మేడా ప్రసాద్ తెలిపారు. నివాస, వాణిజ్య ప్రాంతాలలో, బహిరంగ ప్రదేశాలలో పగటి, రాత్రి సమయాలలో పరిమితులకు మించి శబ్దాన్ని ఉత్పత్తి చేస్తున్న డీజే లతో ఊరేగింపులు చేస్తూ పిల్లలు, వృద్ధులు, రోగులు మరియు విద్యార్థులు, సాదారణ ప్రజలకు, తీవ్ర అసౌకర్యాన్ని కలిగిస్తున్న డీజే లకు అనుమతి లేదని ఎర్రుపాలెం ఎస్సై మేడా ప్రసాద్ తెలిపారు.