సంఘ విద్రోహ శక్తులకు సహకరిస్తే కఠిన చర్యలు ** జిల్లా ఎస్పీ సురేష్ కుమార్ **
ఆసిఫాబాద్ జిల్లా జూలై18 (ప్రజాపాలన, ప్రతినిధి) : జిల్లాలో మావోయిస్టులకు కానీ, ఏ ఇతర విద్రోహశక్తులకు సహకరించినట్లు తెలిస్తే అలాంటి వారిపై కఠిన చర్యలు తప్పవని జిల్లా ఎస్సీ కే సురేష్ కుమార్ సోమవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ జిల్లాలో కొంతమంది వ్యాపారస్తులు, కాంట్రాక్టర్లు, మావోయిస్టులకు వారి సానుభూతి పరులకు ఆర్థికంగా సహకరిస్తున్నట్లు గా తమకు సమాచారం వచ్చిందని, అలాంటి వారిపై కఠిన చర్యలు తప్పవని అన్నారు. మారుమూల గ్రామాలలో గిరిజనులకు మాయమాటలు చెప్పి ఇబ్బంది పెడుతున్నట్లు తెలిస్తే వెంటనే పోలీసులను ఆశ్రయించాలని, ప్రజాశాంతి ప్రజ జీవనాన్ని, స్వేచ్ఛకు భంగం కలిగించే వారికి సహకరించి భవిష్యత్తు నాశనం చేసుకోవద్దని తెలిపారు. మావోయిస్టులకు, విద్రోహశక్తులకు, సహకరించినట్లు తెలిస్తే, వారిపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకోవాలని జిల్లా ఎస్పీ సురేష్ కుమార్, జిల్లా యంత్రాంగానికి ఆదేశించారు. పోలీసులు ఎల్లప్పుడు ప్రజలకు సహకారం అందిస్తారని జిల్లాఎస్పీ పేర్కొన్నారు.
Share this on your social network: