డిసెంబర్ 31వ తేది వరకు మొదటి, రెండో డోసు పూర్తి చేయాలి : జిల్లా కలెక్టర్ నిఖిల

Published: Thursday December 02, 2021
వికారాబాద్ బ్యూరో 01 డిసెంబర్ ప్రజాపాలన : డిసెంబర్ 31వ తేది వరకు మొదటి, రెండో డోసు వంద శాతం పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్లను, వైద్య అధికారులను రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు ఆదేశించారు. బుధవారం హైదరాబాద్ నుండి జిల్లా కలెక్టర్లు, అదనపు కలెక్టర్లు, వైద్య అధికారులు, పంచాయతీ అధికారులతో వ్యాక్సినేషన్ పై రాష్ట్ర పరిశ్రమల, ఐటీ శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు, విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, సిఎస్ సోమేష్ కుమార్ లతో కలిసి వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి సమీక్షించారు. ఈ సందర్బంగా మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ ప్రపంచ వ్యాప్తంగా కొత్త వెరియంట్ ఒమ్రికాన్ వచ్చినందున మూడవ దశ ఎదుర్కొనేలా సంసిద్ధంగా ఉండాలన్నారు. వ్యాక్సినేషన్ రెండు డొసులు వంద శాతంను ఈ నెల 31 వరకు పూర్తి చేయాలని సూచించారు. ఎక్కడ అయితే తక్కువ వ్యాక్సిన్ వేశారో గుర్తించి జిల్లా కలెక్టరులు, వైద్య అధికారులు ప్రజాప్రతినిధుల భాగస్వామ్యంతో పూర్తి చేయాలని సూచించారు. గ్రామాలు, మండలాలు, వార్డులు, మున్సిపాలిటీ లలో వంద శాతం వ్యాక్సినేషన్ పూర్తి చేయుటకు పోటీ తత్వం పెంచాలని సూచించారు. రాష్ట్రంలో మొదటి డోసు తొంబై శాతం పూర్తి అవడానికి వైద్య ఆరోగ్య, మున్సిపల్, పంచాయతీ శాఖలు సమన్వయంతో పని చేయడం వల్ల సాధ్యమైనదని అన్నారు. మొదటి, రెండు డోస్ లు ప్రతి జిల్లాలో వంద శాతం పూర్తి చేయాలని, వాక్సినేషన్ పై ప్రజలకు అవగాహన కల్పించి ప్రతి ఒక్కరు కోవిడ్ టీకా తీసుకునేలా చూడాలని తెలిపారు. ప్రతి గ్రామాన్ని, మండలాన్ని, మున్సిపల్ వార్డును, జిల్లాను వంద శాతం వ్యాక్సిన్ అయినట్లుగా తీర్చిదిద్దేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని తెలిపారు. ప్రతి జిల్లాలో స్పెషల్ డ్రైవ్ నిర్వహించాలని, ప్రజా ప్రతినిధులను భాగస్వామ్యం చేయాలని, స్పెషల్ అధికారులను నియమించాలని ఆదేశించారు. ఐటీ, పురపాలక శాఖ మంత్రి కెటిఆర్ మాట్లాడుతూ మనమందరం మొదటి రెండు దశల ద్వారా పొందిన అనుభవాలను దృష్టిలో ఉంచుకుని మూడవ దశ రాకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని, మూడవ దశను ఎదుర్కొనేందుకు అధికారులు, ప్రజా ప్రతినిధులు సిద్ధంగా ఉండాలన్నారు. అసత్య ప్రచారాలు, అపోహలు ప్రజలు నమ్మకుండా ప్రపంచ ఆరోగ్య సంస్థ ద్వారా మీకు అందుతున్న సమాచారం ప్రజలకు అందేలా చర్యలు తీసుకోవాలని ఆరోగ్య శాఖ అధికారులకు సూచించారు. జిల్లాలలో ఎన్ని బెడ్స్, ఆక్సిజన్ బెడ్స్ అందుబాటులో ఉన్నాయన్న సమాచారం ప్రజలకు అందించాలని వైద్య అధికారులను ఆదేశించారు. విద్యాశాఖ మంత్రి సబితా రెడ్డి మాట్లాడుతు  స్కూల్స్, కాలేజీలు ప్రారంభమైనందున  గురుకులాల్లో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని జిల్లా విద్యాశాఖ అధికారులకు సూచించారు. టీచింగ్, నాన్ టీచింగ్ సిబ్బంది అంత రెండు డోసులు వాక్సినేషన్ తీసుకున్నారని తెలిపారు, విద్య సంస్థలలో విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా చర్యలు తీసుకోవాలని తెలిపారు. 18 సంవత్సరాలు నిండిన విద్యార్థులు వ్యాక్సిన్ తీసుకునేలా చూడాలి అని అన్నారు. ఈ సందర్బంగా జిల్లా కలెక్టర్ నిఖిల మాట్లాడుతూ, జిల్లాలో ఇప్పటి వరకు మొదటి డోజ్ 82 శాంతం పూర్తి చేయడం జరిగిందని, రెండవ డోజ్ 20 శాంతం మాత్రమే నిర్వహించినట్లు తెలిపారు. మొదటి డోజ్ తీసుకొని రెండవ డోజ్ కు అర్హులైన 27,646 మందిని స్పెషల్ డ్రైవ్ నిర్వహించి అందరికి గురువారం నుండి వాక్సినేషన్ పూర్తి చేస్తామని మంత్రికి తెలిపారు.  జిల్లాలోని 08 PHC లలో తక్కువ శాంతం వాక్సినేషన్ చేయడం జరిగిందన్నారు. ఇట్టి నాలుగు PHC లలో ఈరోజు నుండి జిల్లా అదనపు కలెక్టర్లు, వైద్య అధికారులు, స్పెషల్ ఆఫీసర్లతో పాటు కలెక్టర్ కూడా స్వయంగా మున్సిపల్ వార్డులు, గ్రామ పంచాయతీలలో పర్యటించి అందరికి వాక్సినేషన్ వేయడం జరుగుతుందన్నారు. ప్రతి ఇంటికి ఒకటికి నాలుగు సార్లు వెళ్లి డిసెంబర్, 15 లోగా వాక్సినేషన్ చేసి పూర్తి చేస్తామన్నారు. వికారాబాద్ జిల్లాలో వాక్సినేషన్ లక్ష్యం వంద శాంతం పూర్తి చేసేందుకు ప్రతిరోజు అధికారులతో సమీక్ష సమావేశాలు నిర్వహించి వేగవంతిచేయాలనీ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు కలెక్టర్ ను సూచించారు. స్పెషల్ ఆఫీసర్లు, తహసీల్దార్లు, ఎంపీడీఓలు, వైద్య అధికారులను భాగస్వాములు చేసి ఇప్పటి వరకు వాక్సినేషన్ వేయించుకొని వారిని గుర్తించి లక్ష్యం పూర్తి చేయాలని ఆదేశించారు. విద్యా శాఖ మంత్రి కూడా ఈరోజు వికారాబాద్ జిల్లాకు వచ్చి కోవిడ్ వాక్సినేషన్ పై సమీక్షా సమావేశం నిర్వహిస్తారని తెలిపారు. మున్సిపల్ కౌన్సిలర్ల సహాయంతో పట్టణాలలోని అన్ని వార్డులు, కాలనీలలో ఒక్కటికి నాలుగు సార్లు వెళ్లి ప్రతి ఒక్కరికి వాక్సినేషన్ చేయాలని కలెక్టర్కు సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్లు మోతిలాల్, చంద్రయ్య, మున్సిపల్ చైర్మన్ మంజుల రమేష్, జడ్పీ సీఈఓ జానకి రెడ్డి, జిల్లా వైద్య అధికారి తుకారం, జిల్లా విద్యా శాఖ అధికారి రేణుకదేవి, DRDO కృష్ణన్, డీపీవో మల్లారెడ్డి వికారాబాద్, తాండూర్, పరిగి, కొడంగల్ మన్సిపల్ కమీషనర్లు తదితరులు పాల్గొన్నారు.