బోనాల పండగ సందర్బంగా కనకదుర్గ అమ్మవారిని దర్శించుకున్న మంత్రి తలసాని...

Published: Monday July 25, 2022
హైదరాబాద్ (ప్రజాపాలన ప్రతినిధి ):
 
ఆషాఢ మాసం బోనాల పండుగ సందర్భంగా ఆదివారం అమీర్ పేట్ డివిజన్ లోని కనకదుర్గమ్మ అమ్మవారిని  మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ దర్శించుకున్నారు. మాజీ కార్పొరేటర్ శేషుకుమారి, ఈ ఓ ల ఆహ్వానం మేరకు మంత్రి తలసాని అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్బంగా ఆలయ పూజారులు, అధికారులు మంత్రిని శాలువా తో సత్కరించారు.గారు,ఈ కార్యక్రమం లో మాజీ కార్పొరేటర్ శేషు కుమారి, అమీర్ పేట డివిజన్ టి ఆర్ ఎస్ నాయకులు, ఆలయ అధికారులు తదితరులు పాల్గొన్నారు.