వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర మహాసభలను జయప్రదం చేయండి వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా మాజీ ఉపాధ్

Published: Monday November 07, 2022
బోనకల్ ,నవంబర్ 7 ప్రజా పాలన ప్రతినిధి:
వ్యవసాయ కార్మిక సంఘం తెలంగాణ రాష్ట్ర మూడో మహాసభలు డిసెంబరు 5,6 ,7 తేదీలలో ఖమ్మం పట్టణంలో జరగనున్నాయి. ఈ సందర్భంగా డిసెంబర్ 5వ తారీఖున ఖమ్మం పట్టణంలో గొప్ప బహిరంగ సభ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ బహిరంగ సభ ప్రచార నిమిత్తం ఆదివారం జానకిపురం గ్రామంలో వ్యవసాయ కూలీలతో జనరల్ బాడీ సమావేశం ఎస్కే గౌస్ అధ్యక్షతన నిర్వహించారు. ఈ సమావేశంలో వ్యవసాయ కార్మిక సంఘం ఖమ్మం జిల్లా మాజీ ఉపాధ్యక్షులు గుగులోతు నరేష్ మాట్లాడుతూ డిసెంబర్ ఐదో తారీఖున జరిగే బహిరంగ సభకు ముఖ్యఅతిథిగా కేరళ ముఖ్యమంత్రి పినరై విజయన్ హాజరవుతున్నారు. అలాగే సిపిఎం తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం, వ్యవసాయ కార్మిక సంఘం జాతీయ ప్రధాన కార్యదర్శి బి వెంకట్ హాజరవుతున్నారు. ఈ మహాసభల్లో వ్యవసాయ కూలీల సమస్యలు వాటి పరిష్కారం గురించి చర్చించటం జరుగుతుంది. ఈ బహిరంగ సభకు వ్యవసాయ కార్మికులు అధిక సంఖ్యలో పాల్గొని బహిరంగ సభను జయప్రదం చేయాలని కోరారు. ఈ జనరల్ బాడీ లో జానకిపురం సిపిఎం పార్టీ శాఖ కార్యదర్శి కుక్కల కోటేశ్వరావు, నాగేశ్వరరావు, వ్యవసాయ కూలీలు పాల్గొన్నారు.