జన్మదినం సందర్భంగా సామాజిక సేవలు
Published: Monday May 03, 2021
జాతీయ అవార్డు గ్రహీతసూతరి రాజేంధర్
మల్లాపూర్, మే 02 (ప్రజాపాలన ప్రతినిధి) : మల్లాపూర్ మండలం పాత ధాంరాజ్ పల్లి గ్రామానికి చెందిన జాతీయ అవార్డు గ్రహీత సూతరి రాజేంధర్ - సాహిత్య దంపతుల కూతురు వేదశ్రీ, కొడుకు కేసరినందన్ ల జన్మదినం పురస్కరించుకొని ఆదివారం నిరంతరం సామాజిక సేవలు చేస్తున్న మల్లాపూర్ లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో కరోనా ఉద్రిక్తంగా మారిన సమయంలో కరోనా నివారణకు మల్లాపూర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంకు వస్తున్న ప్రజలకు నిత్యం ప్రాణాలకు తెగించి కరోనా రోగులకు సేవలందిస్తున్న వైద్యులు, నర్సులు, ఆశా కార్యకర్తలకు రక్షణగా మాస్కులు, మజ్జిక ప్యాకెట్లలను సూతరి రాజేంధర్ అందజేశారు. ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ అధ్యక్షులు రుద్ర రాంప్రసాద్ మండల బిజెపి అధ్యక్షులు సత్యనారాయణ గౌడ్, నారాయణ, సుమలత, సరిత ఆసుపత్రి సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
Share this on your social network: