కేశవపట్నం వాగు ఇసుక అక్రమ రవాణా శంకరపట్నం ఫిబ్రవరి 24 ప్రజాపాలన రిపోర్టర్:
Published: Saturday February 25, 2023
శంకరపట్నం మండలం కేంద్రంలోని కేశవపట్నం వాగులో ఎలాంటి ప్రభుత్వ అనుమతులు లేకుండా అక్రమంగా ఇసుకను తరలిస్తున్నారు. పోలీస్ స్టేషన్ పక్కనుండే ఇసుకను తరలిస్తున్నప్పటికీ పోలీస్ అధికారులుగానీ, రెవెన్యూ అధికారులు గానీ వారిపై చర్యలు తీసుకోకపోవడాన్ని అదనుగా భావించి ఉదయము, సాయంత్రం వేళల్లో ఇసుక అక్రమ రవాణాను కొనసాగిస్తున్నారు. వీరికి రాజకీయ అండదండలు ఉండడంతో వీరి అక్రమ వ్యాపారం మూడు పువ్వులు ఆరు కాయలు అన్న చందంగా జరుగుతుంది, ఇప్పటికైనా అధికారులు స్పందించి వారిపై చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని వాగు పరివాహక రైతులు కోరుతున్నారు.
Share this on your social network: