ఎంపీ ధర్మపురి అరవింద్ పర్యటన సందర్భంగా కాంగ్రెస్ నాయకుల ముందస్తు అరెస్ట్

Published: Thursday June 23, 2022

కోరుట్ల, జూన్ 22 (ప్రజాపాలన ప్రతినిధి):
నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ కోరుట్ల నియోజకవర్గ పర్యటన సందర్భంగా కోరుట్ల  కాంగ్రెస్ నాయకులను,కార్యకర్తలను ముందస్తుగా అక్రమంగా అరెస్టు చేసి కథలాపూర్ పోలీస్ స్టేషన్ కు తరలించారు. అక్రమ అరెస్ట్ లతో ప్రతిపక్షాల గొంతు నొక్కే ప్రయత్నం చేస్తున్నారని, ఎంపీ ధర్మపురి అరవింద్ ఇచ్చిన హామీలను నెరవేర్చి పర్యటనకు వస్తే ఈ విధంగా ముందస్తు అరెస్ట్ లు చేయించి పర్యటనలు చేసే దుస్థితి ఉండదని కాంగ్రెస్ నాయకులు పేర్కొన్నారు.అరెస్ట్ అయినా వారిలో పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు తిరుమల గంగాధర్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు పెరుమండ్ల సత్యనారాయణ, కోరుట్ల నియోజకవర్గం యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు ఏలేటి మహిపాల్ రెడ్డి, కోరుట్ల మండలం కాంగ్రెస్ ఉపాధ్యక్షులు ముహమ్మద్ నబీ, కోరుట్ల నియోజకవర్గం యూత్ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శులు మ్యాదరీ లక్ష్మణ్, సరికెళ్ళ నరేష్, కోరుట్ల నియోజకవర్గం కాంగ్రెస్ సోషల్ మీడియా ఇంఛార్జి ముహమ్మద్ నసీర్ లు ఉన్నారు.