టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసిన కార్పొరేటర్ రజిత పరమేశ్వర్ రెడ్డి
Published: Wednesday July 14, 2021
మేడిపల్లి, జూలై 13 (ప్రజాపాలన ప్రతినిధి) : తెలంగాణ రాష్ట్ర పీసీసీ చీఫ్, మల్కాజిగిరి ఎంపీ రేవంత్ రెడ్డిని ఆయన నివాసంలో ఉప్పల్ డివిజన్ కార్పొరేటర్ మందుముల రజిత పరమేశ్వర్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చం అందజేసి శుభాకాంక్షలు తెలియజేశారు. రేవంత్ రెడ్డి టీపీసీసీ చీఫ్ గా బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలి సారిగా కార్పొరేటర్ రజితపరమేశ్వర్ రెడ్డి కలిశారు. వీరితోపాటు కార్పొరేటర్ సింగిరెడ్డి శిరీషా సోమశేఖర్ రెడ్డి, పార్టీ రాష్ట్ర నాయకులు వేం నరేందర్ రెడ్డి ఉన్నారు.
Share this on your social network: