ఇబ్రహీంపట్నం నవంబర్ తేదీ 9 ప్రజాపాలన ప్రతినిధి *ఇళ్ల స్థలాలకై పలువురు తాసిల్దారులకు వినతి ప

Published: Thursday November 10, 2022

ఇబ్రహీంపట్నం డివిజన్ రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం నియోజకవర్గ డివిజన్ స్థాయి జర్నలిస్టులు ఇబ్రహీంపట్నం,మంచాల, యాచారం,అబ్దుల్లాపూర్మెట్  మండలాల ఎమ్మార్వోలకు జర్నలిస్టుల ఇళ్ల స్థలాల కేటాయింపుకై వినతి పత్రాలను అందించడం జరిగింది.ఈ సందర్భంగా సీనియర్ రిపోర్టర్ చెరుకూరి మల్లేష్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు కేటాయిస్తామని ఎన్నికల సందర్భంగా హామీ ఇచ్చిందో ప్రభుత్వం అదేవిధంగా జర్నలిస్టులందరికీ ఇళ్ల స్థలాలు కేటాయించాలని, అహర్నిశల సమాజ శ్రేయస్సు కోసం పాటుపడుతు,ప్రతి నిత్యం ప్రజా సమస్యలపై సమగ్ర సమాచారం అందిస్తున్న జర్నలిస్టుల సంక్షేమం కోసం కృషి చేయాలని తెలిపారు.ఈ కార్యక్రమంలో జర్నలిస్టులు సురమోని బాబు,హనుమంతు సుదర్శన్,ముచ్చర్ల నాగేష్, పగడాల నరేందర్ రెడ్డి, ఆలంపల్లి సురేష్,బస్వాపురం దశరథ్,గుండె రాఘవేందర్,  దేంది మహేందర్ రెడ్డి,  మడిపోజు కార్తీక్,శ్యాంసన్,సాయి కిరణ్, పంది స్వామి తదితరులు పాల్గొన్నారు.