*అయ్యప్ప స్వామి ఆలయంలో ఘనంగా పడిపూజ

Published: Friday December 23, 2022
మధిర రూరల్  డిసెంబర్ 22 (ప్రజాపాలన ప్రతినిధి ప్రతిని) మధిర పట్టణంలోని అయ్యప్ప నగర్ లో వేంచేసి ఉన్న శ్రీ స్వామి అయ్యప్ప దేవాలయంలో గురువారం జరిగిన పడి పూజల్లో  పసుపులేటి నాగేంద్ర శ్రీనివాసరావు పుణ్యవతి దంపతులు పాల్గొన్నారు. స్వామివారి 15వ మండల పూజల్లో భాగంగా ఆలయంలో ఈ ప్రత్యేక పూజలు జరుగుతున్నాయి. అనంతరం అయ్యప్ప స్వామి భక్తులకు, మాలధారులకు ఏర్పాటుచేసిన బిక్ష దానం వారు ప్రారంభించారు. ఈ సందర్భంగా పసుపులేటి నాగేంద్ర శ్రీనివాసరావు మాట్లాడుతూ  బిక్ష దానం చేయటం వల్ల స్వామి అయ్యప్ప కృపకు పాత్రులు అవుతామని వారు తెలిపారు  ప్రతి ఒక్కరూ బిక్ష దానం చేయాలన్నారు. ప్రతి సంవత్సరం అయ్యప్ప స్వామి ఆలయంలో మండల పూజలో భాగంగా అయ్యప్ప మాలదారులకు బిక్ష దానం ఏర్పాటు చేయడం అభినందనీయం అన్నారు అనంతరం స్వామి అయ్యప్ప పసుపులేటి నాగేంద్ర శ్రీనివాస్ 18వ  సందర్భంగా గురు స్వాములు అర్చకులు కలిసి అర్చకులు నంబూరి గురు స్వామి చిరు సత్కారం చేసిన పసుపులేటి నాగేంద్ర శ్రీనివాసరావు కుటుంబ సభ్యులుఅనంతరం పడిపూజ  చేసిన 18 అడుగు వేస్తున్న సందర్భంగా పసుపులేటి నాగేంద్ర శ్రీనివాస్ కు ఉమెన్స్ రైట్స్ జాతీయ ఉపాధ్యక్షుడు శివాలయం చైర్మన్ శ్రీనివాస్ అదే విధంగా మాజీగురు స్వాములు భక్తులు చ్చే ఘనంగా 18వ పడి స్వాగతం పలుకుతూ నిండు నూరేళ్లు ఆరోగ్యంతో స్వామి దీవెనలుఉండాలని దీవిస్తూ పసుపులేటి నాగేంద్ర శ్రీను వారి కుటుంబానికి ఘనంగా సన్మానం చేశారు మీ సందర్భంగా శ్రీనివాస్ మాట్లాడుతూ ఈ సన్మానం నాకు ఇచ్చిన గౌరవం భావిస్తూ అందరూ స్వామి అయ్యప్ప కృపకు పాత్రులు కావాలని స్వామి ప్రతి ఒక్కరు సేవ చేయాలి వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో గురుస్వామి దేవిశెట్టి రంగారావు పుల్లారావు నాగభూషణం సుబ్బారావు రమేష్ గాంధీ శ్రీనివాస్ కాశి వంకరపాటి నాగేశ్వరావు బాబు మేడం వెంకటేశ్వర రావు మైనీడి జగన్మోహన్ రావు స్వామి పసుపులేటి నాగేంద్ర శ్రీనివాసరావు, గాంధీ స్వామి ఎంఆర్సి రావు స్వామి తదితరులు పాల్గొన్నారు.