రాయికల్ శివారు మైతాపూర్,బతుకమ్మ వాగుల వరద ఉధృతి

Published: Wednesday July 13, 2022
రాయికల్, జులై 12 (ప్రజాపాలన ప్రతినిధి): నాలుగు రోజుల నుండి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు మైతాపూర్ వాగు, బతుకమ్మ వాగులు ఉదృతంగా ప్రవహిస్తున్నాయి. రాయికల్ నుండి కోరుట్లవైపువెళ్లే రహదారి రాకపోకలు పూర్తిగా స్తంభించిపోయాయి. వాగుల యొక్క వరద ఉధృతి రాయికల్ మున్సిపల్ కమిషనర్ సంతోష్ కుమార్ పరిశీలించారు. అనంతరంమునిసిపల్ నల్లాలబావిలో సీజనల్ వ్యాధులు ప్రబలకుండా క్లోరిన్ చేయించారు. కమిషనర్ వెంటపట్టణ కౌన్సిలర్లు శ్రీధర్ రెడ్డి, మహేందర్,ఎలిగేటి అనిల్, కార్యాలయ సిబ్బంది మేనేజర్ వెంకటి,జూనియర్ అసిస్టెంట్ గంగ నరసయ్య,వినయ్ తదితరులు ఉన్నారు.