సీఎం రిలీఫ్ ఫండ్ పంపిణీ చేసిన టిఆర్ఎస్ మండల నాయకులు

Published: Friday March 19, 2021

మధిర, మార్చి 18, ప్రజా పాలన ప్రతినిధి : మండల పరిధిలోని మల్లారం గ్రామంలో కొంగర శ్రీకాంత్ కి జిల్లా పరిషత్ చైర్మన్ లింగాల కమల్ రాజు చొరవతో మంజూరైన 36 వేల రూపాయలు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కును ఈ రోజు వారి సొంత గ్రామానికి వెళ్లి టిఆర్ఎస్ నాయకులు అందించడం జరిగింది. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ చిత్తూరు నాగేశ్వరరావు, మండల అధ్యక్షులు రావూరి శ్రీనివాసరావు, కార్యదర్శి బొగ్గులు భాస్కర్ రెడ్డి, కోన నరేందర్ రెడ్డి, చావా వేణు, మల్లారం టీఆర్ఎస్ గ్రామ శాఖ అధ్యక్షులు నల్లమల్ల సురేష్, పీర్ సాయిబు తదితరులు పాల్గొన్నారు.