పేపర్ లీకేజీల పై సిట్టింగ్ జడ్జీతో విచారణ జరిపించాలి*

Published: Wednesday March 29, 2023
 మంచిర్యాల టౌన్, మార్చి 28, ప్రజాపాలన : తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ లో పేపర్ లీకేజీ వ్యవహారంపై సిట్టింగ్ జడ్జీతో విచారణ జరిపించాలని, భాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని మిట్టపల్లి తిరుపతి భారత విద్యార్ధి ఫెడరేషన్ జిల్లా కార్యదర్శి అన్నారు. ఈ సదర్భంగా ఆయన మాట్లాడుతూ 
తెలంగాణ ఎర్పడిన నియామకాలు లేక ఏన్నో యేండ్లుగా ఉద్యోగాల కోసం ఏదురుచూపులు చూస్తున్న నిరుద్యోగులు ఈలాంటి చర్యలు తీవ్ర నష్టం చేస్తాయని, లక్షల రూపాయలు వెచ్చించి, విలువైన సమయం కేటాయించి లక్షలాది మంది నిరుద్యోగులు ఉద్యోగాలకు కోచింగ్ తీసుకుంటున్న వారు నిరాశకు  లోనాయ్యరని అన్నారు.బోర్డులో ఇంత జరుగుతున్నా కనీసం పట్టించుకోకుండా నిర్లక్ష్యం వహించిన బోర్డు చైర్మన్ బి.జనార్దన్ రెడ్డి, బోర్డు కార్యదర్శి పాత్రపైనా ,సభ్యుల పాత్రపైనా  తక్షణమే ప్రభుత్వం స్పందించి చైర్మన్ ను తోలగించి విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో   జిల్లా కమిటీ సభ్యుడు చెవుటు మల్లేష్, నస్పూర్ మండల కార్యదర్శి ఈదునూరి అభినవ్,మండల నాయకులు వెంకటేష్,రాకేష్ తదితరులు పాల్గొన్నారు.