పెద్ద చెరువును పర్యాటకకేంద్రంగా మంత్రి సహకారంతో తీర్చిదిద్దుతాం

Published: Friday August 06, 2021
ఇబ్రహీంపట్నం, ఆగస్టు 05, ప్రజాపాలన ప్రతినిధి : కేంద్ర సాంస్కృతిక , పర్యాటక శాఖ మంత్రివర్యులు గంగాపురం కిషన్ రెడ్డి గారిని గురువారం కలిసిన ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి. ఇబ్రహీంపట్నం పెద్దచెరువును పర్యాటక ప్రాంతంగా సాంస్కృతిక వారసత్వ సంపద గా రాచకొండ ప్రాంతాన్ని పర్యాటక క్షేత్రంగా తీర్చిదిద్దాలని మనవి చేసిన మన ఎమ్మెల్యే కు సానుకూలంగా స్పందించిన మంత్రివర్యులు. గంగాపురం కిషన్ రెడ్డి రాచకొండ అభివృద్ధిపై సమగ్ర నివేదిక తయారు చేయాలని కేంద్ర పురావస్తు శాఖ (ఆర్కియాలజీ) విభాగం అధికారులను ఆదేశించిన మంత్రి. ఇబ్రహీంపట్నం పెద్దచెరువును పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దడానికి ప్రత్యేకంగా నిధులు కేటాయిస్తానని హామీ ఇచ్చారు.