మధిర రామాలయ దేవాలయం నందు హుండీలొ కానుకలు లెక్కింపు

Published: Saturday April 01, 2023

మధిర మార్చి 31 ప్రజా పాలన ప్రతినిధి: మధిర పట్టణంలో శ్రీ సీతారామచంద్రస్వామి వారి దేవాలయం నందు శుక్రవారం దేవాలయ పరిశీలకులు ఆర్ సమత,, కార్యనిర్వనాధికారి పాకాల వెంకటరమణ సమక్షంలో హుండీ లో కానుకలు లెక్కింపు చేసినారు. ఈ కానుకలు రు"లు 1,39,008/-ఒక లక్ష ముప్పై తొమ్మిది వేల ఎనిమిది రూపాయలు స్వచ్ఛంద సేవకులు లెక్కింపు జరిపినారు.ఈ కార్యక్రమంలో దేవాలయ అర్చకులు పాలకమండలి అధ్యక్షులు పల్లపోతు ప్రసాదరావు, కమిటీ సభ్యులు హజార్ కృష్ణకుమారి, చలువాది కృష్ణమూర్తి, పంతంగి శేషగిరి, మామిళ్ళపల్లి సతీష్ పాల్గొన్నారు.