మధిర రామాలయ దేవాలయం నందు హుండీలొ కానుకలు లెక్కింపు
Published: Saturday April 01, 2023
మధిర మార్చి 31 ప్రజా పాలన ప్రతినిధి: మధిర పట్టణంలో శ్రీ సీతారామచంద్రస్వామి వారి దేవాలయం నందు శుక్రవారం దేవాలయ పరిశీలకులు ఆర్ సమత,, కార్యనిర్వనాధికారి పాకాల వెంకటరమణ సమక్షంలో హుండీ లో కానుకలు లెక్కింపు చేసినారు. ఈ కానుకలు రు"లు 1,39,008/-ఒక లక్ష ముప్పై తొమ్మిది వేల ఎనిమిది రూపాయలు స్వచ్ఛంద సేవకులు లెక్కింపు జరిపినారు.ఈ కార్యక్రమంలో దేవాలయ అర్చకులు పాలకమండలి అధ్యక్షులు పల్లపోతు ప్రసాదరావు, కమిటీ సభ్యులు హజార్ కృష్ణకుమారి, చలువాది కృష్ణమూర్తి, పంతంగి శేషగిరి, మామిళ్ళపల్లి సతీష్ పాల్గొన్నారు.
Share this on your social network: