జగిత్యాల రూరల్ మండల్ ఎంపీపీ గంగారాం గౌడ్ మృతిపట్ల జీవన్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి

Published: Friday April 30, 2021
జగిత్యాల, ఏప్రిల్ 29, (ప్రజాపాలన ప్రతినిధి) : జగిత్యాల రూరల్ మండల్ మండల ప్రజా పరిషత్ అధ్యక్షుడు గాజర్ల గంగారాం గౌడ్ కరోనా చికిత్స పొందుతూ గురువారం మధ్యాహ్నం మృతి చెందడంతో గ్రాడ్యుయేషన్ ఎమ్మెల్సీ టి.జీవన్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. కరోనా సమయంలో రోగులకు ప్రజాసేవకు అంకితమై అంకిత భావంతో పనిచేసిన గంగారాం ఆత్మకు శాంతి కలగాలని వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలిపారు.