మన బస్తీ మన బడి అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన ఎమ్మేల్యే డా. సంజయ్

Published: Tuesday May 31, 2022

జగిత్యాల, మే 30 (ప్రజాపాలన ప్రతినిధి): పట్టణ 8వ వార్డ్ బుడగ జంగాల కాలనీ లో 11 లక్షలతో, గాంధీనగర్ ప్రాథమిక పాఠశాలలో 30లక్షలతో, ఉస్మాన్ పుర ఫోర్ట్  ఉర్దూ మీడియం పాఠశాలలో 16 లక్షలతో, టి ఆర్ నగర్ 47వ వార్డ్ లో ఉర్దూ మీడియం స్కూల్ లో 20 లక్షలతో మన బస్తీ మన బడి కార్యక్రమంలో పాల్గొనీ అభివృద్ధి పనులకు ఎమ్మేల్యే డా సంజయ్ కుమార్, లైబ్రరీ ఛైర్మెన్ డా చంద్రశేఖర్ గౌడ్, మున్సిపల్ చైర్ పర్సన్ భోగ శ్రావణి ప్రవీణ్ శంకుస్థాపనలు చేసినారు.
ఈ కార్యక్రమంలో వైస్ చైర్మన్ గోలి శ్రీనివాస్, స్థానిక కౌన్సిలర్ లు వనరాసి మల్లవ్వ తిరుమలయ్యా, బాలే లత శంకర్, ఫర్హీన్ సుల్తానా మన్సూర్, కో ఆప్షన్ అనీస్ ఖుతేజ, ఎంఈఓ గాయత్రి, ఈఈఎ. హెచ్ ఖాన్,  ఎస్ఎంసి ఛైర్మెన్ లు నస్రీన్ భేగమ్, రజిత, పర్హీన్, కనక లక్ష్మి,పట్టణ పార్టీ మైనార్టీ అధ్యక్షులు అబ్దుల్ ఖాదర్ మూజాహిధ్, పట్టణ పార్టీ ప్రధాన కార్యదర్శి ఆనంద్ రావు, ఉపాధ్యక్షులు దుమాల రాజ్ కుమార్, యూత్ ప్రధాన కార్యదర్శి శరత్ రావు, పార్టీ కమిటీ అధ్యక్షులు లవంగ రాజేందర్, కౌన్సిలర్ లు, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు