మాదారం డిస్పెన్సరీ లో వ్యాక్సినేషన్ కేంద్రాన్ని ఏర్పాటు చేయాలి

Published: Monday May 03, 2021

బెల్లంపల్లి, మే 2, ప్రజాపాలన  ప్రతినిధి : బెల్లంపల్లి డివిజన్లోని మాదారం టౌన్షిప్ కాలనీలో ఉన్న సింగరేణి డిస్పెన్సరీ లో కోవిడ్ వ్యాక్సినేషన్ సెంటర్ని ఏర్పాటు చేయాలని ఐ ఎన్ టి యు సి బెల్లంపల్లి ఏరియా ఉపాధ్యక్షుడు పేరం శ్రీనివాస్ విజ్ఞప్తి చేశారు. ఆదివారం నాడు స్థానిక విలేకరులతో మాట్లాడుతూ 350 మంది కార్మిక కుటుంబాలవారు నివసిస్తున్నా మాదారం టౌన్షిప్ లో కార్మికులు కార్మికుల పిల్లలు వ్యాక్సిన్ వేసుకోవడానికి పది కిలోమీటర్ల దూరంలో ఉన్న బెల్లంపల్లి ఏరియా హాస్పిటల్ కు గాని గోలేటి డిస్పెన్సరీ కి గాని వెళ్లాల్సి వస్తుందని మాదారం డిస్పెన్సరీ లో ఏర్పాటు చేసినట్లయితే తాండూర్ ప్రజలకు కూడా ఉపయో కరంగా ఉంటుందని  బెల్లంపల్లి జి ఎం సంజీవ రెడ్డి కి ఆయన విజ్ఞప్తి చేశారు.