కోవిడ్ నిబంధనలు పాటించి.. కరోనా నుండి మిమ్మల్ని మీరు కాపాడుకోండి

Published: Wednesday May 05, 2021
పాలేరు మే 4 (ప్రజాపాలన ప్రతినిధి) : కోవిడ్ నిబంధనలు పాటించి.... కరోనా నుంచి కాపాడుకోవాలని మోటాపురం సోసైటీ మాజీ డైరెక్టర్ రావెళ్ల కృష్ణరావు సూచించారు. మండలంలోని ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండలం లోని కోనాయిగూడెం లో తన సొంత ఖర్చులతో మాస్క్లు, శానిటైజర్ల ను మంగళవారం పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ మాస్క్లు విధిగా ధరించాలని సూచించారు. కరోనా ఉధృతి ఎక్కువ అవుతున్నందున్న ప్రజలు అప్రమతంగా ఉండాలని సూచించారు. చేతులను ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకోవాలని అన్నారు. చాలా మంది నిర్లక్ష్యంగా ఉంటున్నారని, అది పద్ధతి కాదు అన్నారు. గంపులు గుంపులుగా ఉండకుండా భౌతికదూరం పాటించాలని సూచించారు. కరోనా మహమ్మారి పై ప్రజలకు అవగాహన కల్పించాలని కోరారు. కరోనా కట్టడికి ప్రభుత్వం కు ప్రజలు సహకరించాలని కోరారు. అత్యవసరం అయితే తప్ప ఇంటి నుంచి ఎవరూ బయటకు రావద్దని అన్నారు. స్వచ్చంద సంస్థలు గ్రామాల్లో ప్రజలకు అవసరమైన మాస్క్లు, కానిటైజర్లను అందించాలని సూచించారు.