వృద్ధాశ్రమంలో ఐసిడిఎస్ ఆధ్వర్యంలో పండ్లు బ్రేడ్స్ పంపిణీ చేసిన ఎంపీపి

Published: Saturday August 20, 2022

అశ్వారావుపేట ప్రజాపాలన (ప్రతి నిధి)  అశ్వారావుపేట లోని స్వాతంత్ర్య ధ్విసాప్తహం వేడుకలలో భాగంగా అంగన్వాడీ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో ఈరోజు అశ్వారావుపేట అమ్మా సేవా సదనం నందు వృద్దులకు, అలాగే ప్రభుత్వ వైద్యశాలలో ఉన్న పేసెంట్లకు 101 మందికి పండ్లూ, బ్రేడ్,స్వీట్లు, బిస్కెట్లు పంపిణి చేసిన అశ్వారావుపేట మండల ప్రజా పరిషత్ అధ్యక్షులు జల్లిపల్లి. శ్రీరామమూర్తి. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణా రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు చేపట్టిన స్వాతంత్ర్య వేడుకలలో భాగంగా ఈరోజు ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది,దానిలో భాగంగానే ఈరోజు వృద్ధాశ్రమంలో, హాస్పటల్ లో ఈ పండ్లూ బ్రేడ్ స్వీట్లు పంపిణీ చేయటం చాలా సంతోషంగా ఉందని అశ్వారావుపేట మండల ప్రజా పరిషత్ అధ్యక్షులు జల్లిపల్లి. శ్రీరామమూర్తి  తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆయన తో పాటు సర్పంచ్ అట్టం.రమ్యా,   యంఆర్వో చల్లా ప్రసాద్,. సిడిపిఓ రోజరాని, సూపర్వైజర్ విజయలక్ష్మి, సౌజన్య,పద్మావతి,డాక్టర్ వెంకటేశ్వర్లు, నార్లపాటీ.రాములు, అశ్వారావుపేట టౌన్ టీ ఆర్ ఎస్ పార్టి కార్యదర్శి పసుపులేటి ఫణీంద్ర తదితరులు పాల్గొన్నారు.