ఉచిత చేప పిల్లల పంపిణీ

Published: Monday December 06, 2021

వెల్గటూర్, డిసెంబర్ 05 (ప్రజాపాలన ప్రతినిధి): స్తంభంపల్లి చెరువులోకి ఉచిత చేప పిల్లలు స్తంభంపల్లి గ్రామంలోని మత్స్యకారుల జీవనోపాధి కోసం ప్రభుత్వం 2లక్షల చేపపిల్లలను మంజూరు చేయగా మత్స్య శాఖ ఆధ్వర్యంలో జిల్లా అధికారులు శనివారం పెద్ద చెరువులో వదిలారు. ప్రతి సంవత్సరం మాదిరిగానే ఈ సంవత్సరం కూడా చెరువులో చెప పిల్లలను వదలడంపట్ల మత్స్యకారులు ఆనందం వ్యక్తం చేస్తు ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ పంపిణీ కార్యక్రమంలో మత్స్యశాఖ ఫీల్డ్ ఆఫీసర్ రాజ్ కుమార్, ఫయాజ్ ఉద్దీన్ మత్స్యకారులు నాగుల రాజయ్య, నాగుల రమేష్, గుమ్ముల రాజయ్య, నాగుల వెంకయ్య, వాసం పల్లి తిరుపతి, నాగుల మహేష్, గుమ్ముల వెంకయ్య, గుమ్ముల గంగన్న,  గుమ్ముల రమేష్ నాగుల లక్ష్మణ్ పాల్గొన్నారు