కరోనా పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి
Published: Monday May 10, 2021
కార్పొరేటర్ గీతా ప్రవీణ్ ముదిరాజ్
మేడిపల్లి, మే9 (ప్రజాపాలన ప్రతినిధి) : తెలంగాణ రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రివర్యులు కేటీఆర్ మరియు ఉప్పల్ ఎమ్మెల్యే బేతి సుభాష్ రెడ్డి ఆదేశాల మేరకు చిల్కానగర్ డివిజన్ కార్పొరేటర్ బన్నాల గీతా ప్రవీణ్ ముదిరాజ్ కరోనా వైరస్ వ్యాప్తి నివారించడంలో భాగంగా డివిజన్లోని సాయిరామ్ నగర్ కాలనీ, అన్నపూర్ణ కాలనీ, న్యూ రామ్ నగర్, బొడ్రాయి, గవర్నమెంట్ పాఠశాల ప్రాంతాలలో సోడియం హైపో క్లోరైడ్ ద్రావణాన్ని పిచికారి చేయించారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ మాట్లాడుతూ కరోనా మహమ్మారిని ఎదుర్కొనేందుకు ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంటోందని, ప్రజలు కూడా అన్ని జాగ్రత్తలు పాటించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ నాయకులు పల్లె నర్సింగ్ రావు, కొండల్ రెడ్డి, మాస శేఖర్, మహమూద్, కొకొండ జగన్, పరమేష్, సకినాల ప్రసాద్, సరిత, సైజాజ్, అనసూయ, బింగి శ్రీనివాస్ బాలు శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.
Share this on your social network: