ఇబ్రహీంపట్నం జనవరి తేదీ 12 ప్రజాపాలన ప్రతినిధి *ఉపాధ్యాయులందరు ఈ నెల 13,14 వ తేదీలలో జరిగే టీఎస్

Published: Friday January 13, 2023

మంచాల మండలంలోని ఉపాధ్యాయా మిత్రులందరు జనవరి13, మరియు14 న జరిగే టీఎస్ యు టి ఎఫ్  5వ రాష్ట్ర మహాసభలకు తరలి రావాలని మంచాల మండల అధ్యక్షులు ఎమ్. డి. అజ్మత్ ఖాన్ పిలుపునిచ్చారు. 
టీఎస్ యుటిఎఫ్ రాష్ట్ర మహాసభ మన్నెగూడలోని బిఎంఆర్  (సార్థ) కన్వెన్షన్ హాల్ లో జరుగుతున్నాయని ఆయన తెలిపారు ప్రారంభ సభ13 జనవరి.ఉదయం 11:00 గంటలకు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల రాగన్న గూడ పాఠశాల నుండి భారీ ఉపాధ్యాయుల ర్యాలీ ఉంటుందని ఆయన తెలిపారు. ఈ మహాసభలలో గౌరవ తెలంగాణ విద్యా శాఖా మాత్యులు శ్రీమతి సబితా ఇంద్రారెడ్డి మరియు ప్రముఖ విద్యావేత్తలు పాల్గొంటారని ఆయన తెలిపారు.ఈ సమావేశంలో మంచాల మండల ప్రధానకార్యదర్శి బాలునాయక్, గౌరవ అధ్యక్షుడు తుల్జారాం, జిల్లా కౌన్సిలర్ లాల గారి నగేష్,ఉపాధ్యక్షుడు యాదయ్య,,మహిళా కన్వీనర్ రూబీన, శ్యామల తదితరులు పాల్గొన్నారు,