కరోనాను జయించిన సీఎల్పీ లీడర్ భట్టి విక్రమార్క

Published: Friday January 21, 2022

మధిర: జనవరి 20 ప్రజాపాలన ప్రతినిధి : కరోనా పాజిటివ్ తో అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందిన తెలంగాణ కాంగ్రెస్ శాసనసభాపక్ష నేత మల్లు భట్టి విక్రమార్క గురువారం నెగటివ్ రావడంతో ఆస్పత్రి నుంచి డిశ్చార్జి అయ్యారు. వైద్యుల సూచన ప్రకారం హైదరాబాద్ లోని తన స్వగృహంలో విశ్రాంతి తీసుకుంటున్నారు. కరోనా నుంచి జయించినప్పటికీ నీరసంగా ఉండడంతో రెండు రోజుల పాటు ఇంట్లో ఉండి రెస్టు తీసుకుంటారు. తాను త్వరగా కరోనా నుంచి కోలుకోవాలని ఆకాంక్షించిన రాష్ట్ర ప్రజలకు, అభిమానులకు, కార్యకర్తలకు, నాయకులకు, మధిర నియోజవర్గ ప్రజలుకాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులకు, అధికారులకు, ప్రజాప్రతినిధులకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు మధిర నియోజవర్గ ప్రజలు మల్లు భట్టి విక్రమార్కలో కరోనా నుంచి నెగటివ్ రావటంతో నియోజకవర్గ ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. మండల కాంగ్రెస్ పిలుపు మేరకు కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో నియంత్రణకు ప్రభుత్వం పకడ్బందీగా చర్యలు తీసుకోవాలని కోరారు. ప్రజలు అప్రమత్తంగా ఉండి తగిన జాగ్రత్తలు పాటించి కరోనాను కట్టడి చేయాలని సూచించారు.