సి.సి రోడ్డు పనులను పరిశీలన, పాఠశాల సందర్శన ఎం. పి. పి ఎం.పి.డీ.వో.

Published: Friday February 25, 2022

రాయికల్, ఫిబ్రవరి 24 (ప్రజాపాలన ప్రతినిధి): రాయికల్ మండలం శ్రీరామ్ నగర్ గ్రామంలో జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం క్రింద మంజూరై నిర్మాణం జరుగుతున్న సి.సి రోడ్డు పనులను రాయికల్ మండల ప్రజా పరిషత్ అధ్యక్షురాలు లౌడియా సంధ్యారాణి సురేంద్ర నాయక్, తో కలిసి మండల అభివృద్ధి అధికారి గంగుల సంతోష్ కుమార్ పరిశీలించారు. ఆయనతోపాటు పంచాయతీరాజ్ ఎ.ఇ ప్రసాద్. అజయ్, గ్రామ సర్పంచ్ మరియు వార్డు మెంబర్లు తదితరులు పాల్గొన్నారు. అనంతరం ఆళ్లీపూర్ గ్రామంలో గడికోట పాఠశాలను మండల ప్రజా పరిషత్ అధ్యక్షురాలు లౌడియా సంధ్య రాణి ఎం.పి.డీ.వో గంగుల సంతోష్ కుమార్ సందర్శించారు. విద్యార్థులకు వండి పెడుతున్న మధ్యాహ్న భోజన వంటకాలను ఎం.పి.పి స్వయంగా పరిశీలించారు. అలాగే ఎం.పి.డి.ఓ.సంతోష్ కుమార్ విద్యార్థులను విద్య గురించి ప్రశ్నలు అడిగారు. తర్వాత క ఉపాధ్యాయులతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో ఎస్ ఎం ఎస్ చైర్మన్ గ్రామ సర్పంచ్ అతినేని గంగారెడ్డి, ఎం.పి.టి.సీ మోర విజయ, కో ఆప్షన్ సభ్యులు మరియు వార్డు మెంబర్లు గ్రామ ప్రముఖులు, నాయకులు తదితరులు పాల్గొన్నారు.