మహిళ వృద్ధులు వికలాంగులకు దుస్తులు పంపిణీ

Published: Wednesday December 21, 2022
బోనకల్, డిసెంబర్ 20 ప్రజాపాలన ప్రతినిధి:
మండల పరిధిలోని లక్ష్మీపురం గ్రామంలోని ఒంటరి మహిళలకు, వృద్ధులకు, వికలాంగులకు దుస్తులు పంపిణీ కార్యక్రమాన్ని పాలేరు విచారణ కర్తలు ఫాదర్ కొమ్ము అంతోని ఆధ్వర్యంలో మంగళవారం గ్రామంలోని పేదలకు చీరలు పంపిణీ చేశారు. దాదాపు యాబై మందికి పైగా పంపిణీ కార్యక్రమాన్ని చేశారు. రానున్న రోజుల్లో ఇలాగే పేదలకు సహాయం చేస్తానని వారు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ప్రొద్దుటూరు విచారణ కర్తలు ఫాదర్ ఏసురత్నం, చర్చి పంతులు ఇరుగు రాజు, సంఘ పెద్దలు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.