*అంబేద్కర్ కు నివాళులు అర్పించిన జడ్పీటీసీ ప్రమీల..

Published: Saturday February 25, 2023
తల్లాడ, ఫిబ్రవరి 24 (ప్రజా పాలన న్యూస్): 
 *ఖమ్మం జడ్పి కార్యాలయంలో నూతనంగా ఏర్పాటుచేసిన భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ శుక్రవారం ఆవిష్కరించారు. జడ్పి చైర్మన్ లింగాల కమల్ రాజ్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో జిల్లాలోని అన్ని మండలాల జడ్పిటిసి లతోపాటు తల్లాడ మండల జడ్పిటిసి దిరిశాల ప్రమీల హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమె అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ ను గుర్తించి ఇలా విగ్రహాలను ఏర్పాటు చేయటం చాలా సంతోషకరమన్నారు.*