రాష్ట్రంలో రైళ్ల సదుపాయాలు విస్తరించండి. ...సౌత్ సెంట్రల్ రైల్వే జిఎం కు వినతి పత్రం అందజేసి

Published: Saturday November 26, 2022
మంచిర్యాల బ్యూరో, నవంబర్ 25, ప్రజాపాలన.
 
తెలంగాణ రాష్ట్రంలో రైళ్ల సదూపాయాలు విస్తరించాలని సౌత్ సెంట్రల్ రైల్వే జిఎం కు పలు సమస్యలతో కూడిన వినతి పత్రాన్ని   అమ్మాద్మీ పార్టీ నాయకులు అందజేశారు.  జిల్లా కేంద్రంలో ని రైల్వేస్టేషన్ కు వచ్చిన సౌత్ సెంట్రల్ రైల్వే జిఎం  శుక్రవారం సందర్శించడం జరిగింది. ఈ సందర్భంగా అమ్మాద్మీ పార్టీ జిల్లా నాయకులు నల్ల నాగేంద్రప్రసాద్ మీడియా తో మాట్లాడారు. బల్లార్ష నుండి కాజీపేట వెల్లే ట్రైన్ ని హైదరాబాద్ వరకు పొడిగించాలని కోరడం జరిగిందన్నారు. అదేవిధంగా  కాగజ్నగర్ నుండి తిరుపతి వరకు ఒక నూతన ట్రైన్ ని వేయాలని కోరినట్లు తెలిపారు. జిల్లా లోని రైల్వే స్టేషన్లో రెండవ ఫ్లాట్ ఫామ్ లో టికెట్ కౌంటర్ ఏర్పాటు చేయాలని అన్నారు. 
ఐతే జియం సానుకూలంగా స్పందించారని , సమస్యలన్నింటిపై పరిశీలించి పరిష్కారం చేస్తామని తెలినట్లు పేర్కొన్నారు.  ఈ కార్యక్రమంలో   నయం పాషా, రాజు తదితరులు పాల్గొన్నారు.