శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ సేవలు అజరామరం

Published: Thursday June 24, 2021
ఘననివాళులు అర్పించిన బీజేపీ నాయకులు
 
శేరిలింగంపల్లి, ప్రజాపాలన ప్రతినిధి : శేరిలింగంపల్లి 106 డివిజన్ బీజేపీ అధ్వర్యంలో భారతీయ జనసంఘ్ వ్యవస్థాపకులు శ్యామ ప్రసాద్ ముఖర్జీ వర్ధంతి సందర్భంగా వారికి ఘన నివాళి అర్పించడం జరిగింది. అప్పటి నిరంకుశ కాంగ్రెస్ పాలనకు వ్యతిరేకంగా శ్యామ ప్రసాద్ ముఖర్జీ జాతీయ వాద ప్రభుత్వం ఉండాలనే ఉద్దేశంతో భారతీయ జనసంఘ్ పార్టీనీ స్థాపించారని, జాతి వ్యతిరేక కాంగ్రెస్ చేస్తున్న మోసాలను ఎండ గట్టిన ముఖర్జీని జైలుకి పంపి ముప్ప తిప్పలు పెట్టారని, దేశం కోసం ముఖర్జీ తన ప్రాణాన్నే త్యాగం చేశారని ఈ సందర్భంగా బీజేపీ నాయకులు గుర్తు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో రంగారెడ్డి జిల్లా మాజీ వైస్ చైర్మెన్, యాదాద్రి భువనగిరి జిల్లా బీజేపీ ఇంఛార్జి నంద కుమార్ యాదవ్, రాష్ట్ర దళిత మోర్చ అధికార ప్రతినిధి కాంచన కృష్ణ, రంగారెడ్డి అర్బన్ జిల్లా బీజేపీ ఉపాధక్ష్యులు బుచ్చి రెడ్డి, ప్రధాన కార్యదర్శి చింతకింది గోవర్ధన్ గౌడ్, అధికార ప్రతినిధి మారం వెంకట్, సీనియర్ నాయకులు మహిపాల్ రెడ్డి, డివిజన్ అధ్యక్ష్యులు రాజు శెట్టి కురుమ, రంగారెడ్డి అర్బన్ జిల్లా ఓ.బీ.సి మోర్చా కార్యదర్శి భరత్ రాజ్, బీజేవైఎం నాయకులు నీరాటి చంద్ర మోహన్, ప్రధాన కార్యదర్శులు సత్య కురుమ, చిట్టా రెడ్డి ప్రసాద్, ప్రశాంత్ చారి, ఉపాధ్యక్షులు కొడిదల బాబు, భీమాని విజయ లక్ష్మి, భీమాని సత్య నారాయణ, కుమార్ యాదవ్, అరుణ కుమారి, అశోక్ నాయక్, విఠల్ రాథోడ్, ఎళ్లేశ్ కురుమ, ఎం.ఆకాశ్, కార్యకర్తలు పాల్గొన్నారు.