డబుల్ బెడ్ రూం ఇండ్ల కు స్థల పరిశీలన.

Published: Friday February 05, 2021

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, గుండాల, ఫిబ్రవరి 04, ప్రజాపాలన: మండలంలోని దామరతోగు పంచాయతీకి సంబంధించి డబుల్ బెడ్ రూం ఇండ్ల నిర్మాణం కోసం గురువారం  ఏఈ విశ్వేశ్వరరావు, డబుల్ బెడ్ రూం కాంట్రాక్టర్ తో కలిసి దామరతోగు సర్పంచు సుతారి సరోజన సత్యం స్థల పరిశీలన చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిరుపేదల సొంత ఇంటి కల సాకారం చేసేందుకు గాను డబుల్ బెడ్ రూం ఇండ్ల మంజూరులో భాగంగా దామరతోగు గ్రామంలో 40 డబుల్ బెడ్ రూం ఇండ్ల నిర్మాణం కోసం స్థల సేకరణ చేశామని త్వరలో నిర్మాణాలు చేపట్టనున్నట్లు చెప్పారు.కార్యక్రమంలో వార్డు సభ్యులు, గ్రామస్తులు పాల్గొన్నారు

ఫోటో రైటఫ్:- అధికారులతో కలిసి స్థల పరిశీలన చేస్తున్న సర్పంచు.