నర్సమ్మకు కాంగ్రెస్ నాయకులు సీతారాములు నివాళులు..

Published: Friday March 11, 2022
తల్లాడ, మార్చి 10 (ప్రజాపాలన న్యూస్):  ఖమ్మం జిల్లా సత్తుపల్లి నియోజకవర్గంలోని బేతిపల్లి గ్రామంలో కర్రీ నర్సమ్మకు జిల్లా కాంగ్రెస్ నాయకులు నాగా సీతా రాములు నివాళులు అర్పించారు. బుధవారం ఆమె దశదిన కార్యక్రమానికి ఆయన హాజరై వారి చిత్రపటానికి పూలువేసి నివాళులర్పించారు. వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి, సంతాపాన్ని వ్యక్తం చేశారు. ఆయన వెంట నాయకులు బుక్కా. కృష్ణవేణి, హరిబాబు యాదవ్, నల్లమోతు. సునీల, గంగుల వెంకటేశ్వర్లు, గొల్ల అప్పారావు, ఎర్రగొల్ల.కృష్ణ, రాజులపాటి శ్రీను, తదితరులు పాల్గొన్నారు.